మళ్లీ సేమ్ సీన్. వస్త్ర దుకాణాలు, నగల షాపుల వారు ప్రమోషన్ కోసం ఆఫర్లు
పెట్టడం..వాటి కోసం మహిళలు ఎగబడటం..తొక్కిసలాట జరగడం. చాలా కామనైపోయింది. ఈ
తరహా ఘటన ఇప్పుడు పెద్దపల్లిలో జరిగింది.
పెద్దపల్లిలోని
ఓ వస్త్ర దుకాణం ఆషాడం బంపర్ ఆఫర్ కింద కేవలం రూ.20కే చీర అని ప్రచారం
చేసింది. ఆ ఆఫర్ కూడా ఒక గంట పాటే ఉంటుందని చాటింది. ఇక ఏమైనా ఉందా?.
పెద్దపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా వచ్చిన మహిళలు
గురువారం ఉదయాన్నేషాప్ ముందు ప్రత్యక్షమయ్యారు. దీంతో దాదాపు కి.మీ మేర
పెద్ద క్యూ లైన్ ఏర్పడింది. అలా షాప్ తెరిచారో లేదో.. చీరల కోసం అంతా
ఎగబడ్డారు. కొద్ది సేపు తొక్కిసలాట జరిగింది. వాళ్లను అదుపు చేయలేక షాపు
నిర్వాహకులు చేతులెత్తేశారు.
పరిస్థితి తేడావస్తే అసలు షాపు ఉంటుందో.. లేదో
అనుకున్నాడో ఏమో? యజమాని షట్టర్ క్లోజ్ చేశాడు. పోలీసులు కూడా రంగప్రవేశం
చేశారు. దీంతో ఎంతో ఆశపడి, ప్రయాసపడి అక్కడికి వచ్చిన మహిళలు నిర్వాహకులకు
శాపనార్థాలు పెట్టి అక్కడినుంచి జారుకున్నారు.
No comments:
Post a Comment