టీం ఇండియా ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని మరి కొద్దీ రోజుల్లో రాజకీయ రంగ
ప్రవేశం చేయబోతున్నాడా అంటే, అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దేశం
మొత్తం తమ జెండా రెపరెపలాడించాలని చూస్తున్న బీజేపీ పార్టీ తమ ప్రణాళికలో
భాగంగా ధోనిని తమ పార్టీలోకి తీసుకోని రావటానికి గట్టిగానే ప్రయత్నాలు
చేస్తున్నట్లు తెలుస్తుంది. వరల్డ్ కప్ తర్వాత ధోని రిటర్మెంట్ ఉంటుందని
వార్తలు వస్తున్నా నేపథ్యంలో, ఆ తర్వాత అతని సేవలను పార్టీ పరంగా
వాడుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తుందని తెలుస్తుంది.
ఈ ఏడాది చివరి నాటికి ధోని సొంత రాష్ట్రమైన జార్ఖండ్ లో అసెంబ్లీ
ఎన్నికలు జరగనున్నాయి. ఆ సమయానికి ధోనిని పార్టీలోకి చేర్చుకొని ఎన్నికలకు
వెళ్లాలని బీజేపీ చూస్తుంది. ఒక వేళ ధోని పార్టీలోకి రాకపోయినా సరే, కనీసం
ధోనితో ప్రచారమైన చేపించి, ఆ తర్వాత రాజ్యసభకి పంపించాలని బీజేపీ
యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ధోని లాంటి వ్యక్తి బీజేపీ తరుపున ప్రచారం
చేస్తే వచ్చే క్రేజ్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోండి. అందుకే ధోనిని ఎలాగైనా
ఆకర్షించాలని బీజేపీ గట్టిగానే పోరాడుతుంది. ఇలా సెలెబ్రిటీస్ ని
వాడుకోవడంలో బీజేపీ పార్టీ దిట్ట.
ఇప్పటికే మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ – భోజ్ పురి నటుడు మనోజ్ తివారి
ఢిల్లీ నుంచి – నటులు రవికిషన్ యూపీలోని ఘోరఖ్ పూర్ నుంచి ఎంపీలుగా
గెలిపించి పార్లెమెంట్ కి పంపించింది. ఈ వరుసలో ధోని చేరిన
ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 2019 ఎన్నికలకి ముందు బీజేపీ చేసిన, చేయబోతున్న
అభివృద్ధి గురించి దేశంలోని బిగ్ సెలెబ్రటీస్ ని కలిసి తమ పార్టీకి
సపోర్ట్ చేయమని బీజేపీ పెద్దలు అడిగి , మద్దతు కూడగట్టారు. ఇలా ఎవరిని
ఎప్పుడు వాడాలో వాళ్ళకి బాగా తెలుసు.
No comments:
Post a Comment