సందీప్ రెడ్డి వంగా ఏ ముహూర్తాన “అర్జున్ రెడ్డి” మూవీ కథను
రాసుకున్నాడో తెలియదు కానీ, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయాడు.
విజయ్ దేవరకొండ హీరోగా 2017లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయం
సాధించినప్పటికీ, కొందరు సామజికవాదులు,రాజకీయ ప్రముఖులు ఈ మూవీలోని ముద్దు
సన్నివేశాలతో పాటు,కంటెంట్ కు వ్యతిరేకంగా తీవ్ర అసంతృప్తి తెలిపారు.
కొద్ది రోజులపాటు మీడియా ఛానెళ్లు ప్రత్యేక డిబేట్లు పెట్టి హోరెత్తించారు.
అది ఫ్రీ పబ్లిసిటీ గా సినిమాకి ఉపయోగపడి ఇంకా ఆదరణ పెరిగేలా చేసింది.
ఇదే “అర్జున్ రెడ్డి” మూవీని దర్శకుడు సందీప్ రెడ్డి షాహిద్ కపూర్
హీరోగా ” కబీర్ సింగ్” పేరుతో హిందీలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకొని,
రికార్డు కలెక్షన్స్ వైపుగా దూసుకుపోతుంది. ఐతే బాలీవుడ్ లో కూడా ఈ
చిత్రం అనేక విమర్శలు, వివాదాలు రాజేసింది. ఐతే తాజాగా ఈ మూవీ వివాదాలపై
స్పందించిన దర్శకుడు ఇద్దరు ప్రేమికులు ఘాడమైన ప్రేమలో ఉన్నప్పుడు,ఒకరిపై
మరొకరు చేయి చూసుకోవడం సాధారణ విషయమే అన్నారు. ఈ స్టేట్మెంట్ ను సింగర్
చిన్మయి,అనసూయ,సమంత తప్పుబట్టడంతో పాటు సందీప్ పై ట్విటర్ వేదికగా
మండిపడ్డారు.
ఐతే ఈ విషయంలో సందీప్ రెడ్డికి కొందరి నుండి గట్టి మద్దతు దక్కుతుంది.
ఆయన అభిమానులు కొందరు ఏకంగా “వి సపోర్ట్ సందీప్ రెడ్డి” అనే యాష్ ట్యాగ్ తో
ట్విట్టర్ వేదికగా తమ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఏదిఏమైనా ఈ
వివాదాలు మాత్రం మూవీకి ఉచిత ప్రచారంగా ఉపయోగపడి వసూళ్లకు దోహదం
చేస్తున్నాయి.
No comments:
Post a Comment