Saturday, January 2, 2021

సింగిల్ సిట్టింగ్ లో అందరూ ఓకే చేసిన కథ

 

ప్రభాస్ తో చేయబోయే సైన్స్-ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ ఒకటి బయటపెట్టాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎవ్వరికీ రెండోసారి కథ చెప్పలేదట. అంతా సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పారట.

''ఎవడే సుబ్రమణ్యం'' సినిమాకు ముందే నాగ్ అశ్విన్ మనసులో నలుగుతున్న కాన్సెప్ట్ ఇది. అలా మైండ్ లో డెలవర్ అయి ఓ షేప్ తీసుకుంది. మహానటి సక్సెస్ తర్వాత, తన మైండ్ లో కొన్నేళ్లుగా నలుగుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టును తెరపైకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడు నాగ్ అశ్విన్. 3 నెలల పాటు కూర్చొని తన ఆలోచనకు ఓ కథారూపం ఇచ్చాడు.


 

ఆ తర్వాతే హీరో ఎవరనే విషయాన్ని ఆలోచించాడట. ఇప్పుడున్న హీరోల్లో తన కథను మోయగలిగే సత్తా ఉన్న హీరో ప్రభాస్ మాత్రమే అని భావించి, అశ్వనీదత్ సహకారంతో వెళ్లి కథ వినిపించాడు. స్టోరీ విన్న ప్రభాస్ సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పాడట. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ ను, ఆ తర్వాత దీపిక పదుకోన్ ను కూడా సింగిల్ సిట్టింగ్ లోనే ఒప్పించాడట దర్శకుడు.

తన కథలో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని.. ప్రభాస్ తర్వాత బిగ్ బి, దీపిక పాత్రల నిడివి చాలా ఎక్కువ ఉంటుందని చెబుతున్నాడు నాగ్ అశ్విన్. సినిమాలో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని, కనీసం 40శాతం వరకు యాక్షన్ ఉంటుందంటున్న ఈ దర్శకుడు.. మార్చి నెల నుంచి ప్రభాస్ తో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నాడు.

No comments:

Post a Comment