Friday, February 19, 2021

చలసాని శ్రీనివాస్‌ కుమార్తె ఆత్మహత్య

ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్య చేసుకున్నారు. రాయదుర్గం పోలీసు స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఇంటీరియర్‌ డిజైనర్‌గా పనిచేస్తున్న శిరిష్మకు ఓయూ కాలనీలోని ట్రయల్‌ విల్లాస్‌లో నివసించే గ్రానైట్‌ వ్యాపారి సిద్ధార్థ్‌తో 2016 డిసెంబర్‌లో వివాహమైంది. ప్రస్తుతం వారిద్దరు గచ్చిబౌలిలోని ఐకియా స్టోర్‌ సమీపంలోని ప్లాట్‌ 906–డిలో నివాసం ఉంటున్నారు. వివాహమై నాలుగేళ్లయినా వీరికి సంతానం కలగకపోవడంతో శిరిష్మ తీవ్ర డిప్రెషన్‌కు లోనయ్యారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన సిద్ధార్థ్‌.. ఉరేసుకున్న శిరిష్మను చూసి కిందకి దింపి చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి చలసాని శ్రీనివాస్‌ ఫిర్యాదుతో పోలీసులు గురువారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

No comments:

Post a Comment