Wednesday, December 20, 2017

కష్టపడి సంపాదించినా.. కక్కూర్తితో ఇరుక్కుంది

చాలామంది సినీతారలు.. ఎండనకా వాననకా కష్టపడి.. రోజూ షూటింగులు చేసి.. ఖాళీ సమయాల్లో గంటలతరబడి జిమ్ లోనే ఉంటూ ఒళ్ళను హూనం చేసుకుని.. ఎన్నో సినిమాల్లో నటిస్తూ.. డబ్బులు సంపాదిస్తారు. అయితే అలా సంపాదించిన డబ్బుతో ఎక్కడో ఓ చోట కక్కూర్తి పడితే.. అది మొత్తానికే మోసాన్ని తెస్తుంది. అదిగో ఇప్పుడు అమలా పాల్ పరిస్థితి అలాగే ఉంది.

హీరోయిన్ అమలా పాల్ వాడే లగ్జరీ కారు.. తిరుగోతంది కేరళలో అయినా కూడా.. రిజిస్ర్టేషన్ మాత్రం పాండిచ్చేరిలో అయినట్లు ఉంది. అలా పాండిచ్చేరి వంటి యునియన్ టెరిటరీలో రిజిస్టర్ చేయించుకోవడం వలన.. దాదాపు 20 లక్షల వరకు ట్యాక్స్ తగ్గుతుంది. ఇండియాలో ఎక్కడైనా ఉంటాం.. ఎక్కడైనా కారు కొనుక్కుంటాం అంటూ అమల ఏదో పొలిటికల్ పంచ్ వేసే ప్రయత్నం చేసింది కాని.. సడన్ గా హైదరాబాదులో ఉండే వ్యక్తి పంజాబ్ లో కారు రిజిష్టర్ చేయించుకుంటా అంటే కుదరదు. దానికి అడ్రస్ ప్రూఫ్ తో పాటు ఇతర ప్రూఫులు ఉండాలి. అందుకే ఇప్పుడు అమల పాండిచ్చేరిలో ఉంటున్నట్లు దొంగ డాక్యుమెంట్లు పెట్టిందనే అభియోగంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇకపోతే ఈ కేసుకు సంబంధించిన నోటీస్ అందుకున్నా కూడా.. అమ్మడు విచారణకు రాలేదు. ఆమె లాయర్ వచ్చి.. అమల బాగా బిజీ అన్నాడు. అయితే కోర్టును సంప్రదించి అవసరమైతే అమలపై అరెస్ట్ వారెంట్ కూడా తెస్తామంటూ ఖాకీలు కూడా రెచ్చిపోతున్నారు. ఎలా చూసినా కూడా అమల ఇరుక్కుపోయిందనే అనిపిస్తోంది.

No comments:

Post a Comment