Monday, July 15, 2019

కబీర్ సింగ్ @ రూ.300 కోట్లు

ఎన్నో వివాదాలు, మరెన్నో విమర్శలు తెచ్చుకున్న కబీర్ సింగ్ సినిమా వసూళ్ల విషయంలో మాత్రం తగ్గడంలేదు. ఓవైపు మహిళా సంఘాలు ఈ సినిమాను దుయ్యబడుతున్నా.. సినిమా చూసే వాళ్ల సంఖ్య మాత్రం తగ్గలేదు. నిన్నటితో నాలుగో వారాంతం పూర్తిచేసుకున్న ఈ సినిమా మరో రికార్డు సృష్టించింది. వరల్డ్ వైడ్ 300 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది.
కేవలం 70 కోట్ల రూపాయల బడ్జెట్ లో తీసిన ఈ సినిమా ఇప్పుడు 4 వీకెండ్స్ గడిచేసరికి ఏకంగా 300 కోట్ల సంపాదించడంతో ట్రేడ్ ఆశ్చర్యపోయింది. ఒక్క ఇండియాలోనే ఈ సినిమాకు 260 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇప్పటికీ ఈ సినిమా నార్త్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.
తెలుగులో విజయ్ దేవరకొండ, షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్, కియరా అద్వానీ చేశారు. సందీప్ రెడ్డి వంగ డైరక్ట్ చేసిన ఈ సినిమాను బాలీవుడ్ క్రిటిక్స్ ఏకిపడేశారు. ఇదేం సినిమా అంటూ ఆడిపోసుకున్నారు. సందీప్ రెడ్డి కూడా అస్సలు తగ్గలేదు. క్రిటిక్స్ పేర్లు ప్రస్తావించి మరీ ఎదురుదాడికి దిగాడు. త్వరలోనే అర్జున్ రెడ్డికి బాబులాంటి మరో సినిమా తీస్తానని కూడా ఛాలెంజ్ చేశాడు.
ఈ వివాదం సంగతి పక్కనపెడితే.. టాలీవుడ్ ప్రేక్షకుల తరహాలోనే బాలీవుడ్ ఆడియన్స్ కూడా అర్జున్ రెడ్డిని ఆదరించారు. మొదటివారం ఈ సినిమాకు 134 కోట్లు రాగా, రెండోవారం 79 కోట్లు, మూడోవారం 36 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. మరో వారంరోజుల పాటు ఈ సినిమా థియేటర్లలో కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది.

No comments:

Post a Comment