పట్టువదలని విక్రమార్కుడు పివిపి
మూడు వందల కోట్ల మేరకు అతి పెద్ద పరువునష్టం దావా వేయబోతున్నారు. ఇటీవల
జరిగిన ఎన్నికల్లో విజయవాడ నుంచి పివిపి పోటీచేసారు. ఆ సమయంలో ఆయనకు
ప్రత్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని ఈయనపై పలు ఆరోపణలు చేసారు. వాటిని
వివిధ మాధ్యమాలు ప్రసారం చేసాయి. కొన్ని మాధ్యమాలు ప్రత్యకంగా
ప్రస్తావించాయి.
ఇప్పుడు ఈ విషయమై పివిపి ఓ నోటీసును కేశినేని నానికి ఇచ్చారు. రూల్స్
ప్రకారం ఈ నోటీస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇచ్చి, రూల్స్ ప్రకారం టైమ్
గ్యాప్ ఇచ్చి పరువునష్టం దావా వేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఆ
దావా కూడా కేవలం కేశినేని మీద కాకుండా, టీవీ 5, మహా టీవీల మీద, కలిపి,
వందేసి కోట్ల వంతున పరువు నష్టం దావా వేయబోతున్నట్లు ఆ వర్గాల బోగట్టా.
అంతేకాకుండా తొలిసారి, మాధ్యమ సంస్థల మీదే కాకుండా, అవి ప్రసారం చేసిన
కార్యక్రమాల్లో పాల్గొన్న అందరి పైనా కూడా దావా వేయబోతున్నట్లు
తెలుస్తోంది. ఈ విషయంలో తాను వెనక్కు తగ్గేది లేదని, పివిపి చెబుతున్నట్లు
బోగట్టా. బహుశా ఆగస్టు రెండోవారంలో ఈ పరువునష్టం దావాలు వేస్తున్నట్లు
తెలుస్తోంది.
No comments:
Post a Comment