Tuesday, July 9, 2019

స్టేజ్ మీద హీరోయిన్.. కింద విలేకరి.. రచ్చ రచ్చ

బాలీవుడ్ కాంట్రవర్శీ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. తన సినిమా ప్రమోషన్లలో ఆమె చేసిన అతి వివాదానికి దారి తీసింది. తన ప్రతి సినిమా రిలీజ్ ముంగిట ఏదో ఒక వివాదాన్ని రాజేయడం ఆమెకు అలవాటే. ఎక్కువగా సెలబ్రెటీల్నే టార్గెట్ చేసి పబ్లిసిటీ తెచ్చుకుంటూ ఉంటుంది కంగనా. ఐతే ఈసారి ఆమె టార్గెట్ ఒక విలేకరి అయ్యాడు. కంగనా కొత్త సినిమా ‘జడ్జిమెంటల్‌ హై క్యా’ సినిమా నుంచి ‘వఖ్రా స్వాగ్‌’ అనే పాటను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కంగన ఒక ప్రెస్ మీట్లో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ విలేకరి కంగనను సినిమా గురించి ప్రశ్నిస్తుండగా.. మధ్యలో ఆమె కలగజేసుకుని టాపిక్ డైవర్ట్ చేసింది. ‘మీరు నేను నటించిన ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ సినిమా గురించి ఇష్టానుసారం రాయడం కరెక్టేనా? అలాంటి సినిమా తీసి నేనేమన్నా తప్పుచేశానా? నా గురించి అలా ఎలా రాస్తారు?’ అని ప్రశ్నించింది.
ఐతే ఆ విలేకరి.. ‘మీరంటున్నట్లు మీ గురించి నేనేమీ తప్పుగా రాయలేదు’ అన్నాడు. కానీ కంగనా ఊరుకోలేదు. రెట్టించి మాట్లాడింది. దీనికతను బదులిస్తూ.. ‘మీరు టాప్‌ హీరోయిన్‌ అయినంతమాత్రాన ఓ విలేకరిని ఇలా బెదిరిస్తున్నట్లుగా మాట్లాడటం సరికాదు’ అన్నాడుు. వాదన పెరిగింది. సదరు విలేకరి ‘మణికర్ణిక’ సినిమా విడుదల సమయంలో తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడని, మూడు గంటల పాటు తనను ఇంటర్వ్యూ చేశాడని.. తన వానిటీ వ్యాన్‌లో ఇద్దరం భోజనం కూడా చేశామని చెప్పింది. కానీ ఆ విలేకరి మాత్రం తాను కంగనాను ఇంటర్వ్యూ చేయలేదని, ఆమెతో భోజనం చేయలేదని అన్నాడు. ఇంతలో మరో విలేకరి జోక్యం చేసుకుని.. కంగనా ప్రతి విషయాన్నీ వివాదం చేస్తోందంటూ గట్టిగా అరిచాడు. గొడవ పెద్దదైంది. దీంతో కంగనా తగ్గింది. తాను కావాలని ఎవరినీ భయపెట్టాలని మాట్లాడట్లేదని అంటూ సారీ చెప్పింది. దీంతో వివాదం సద్దుమణిగింది.

No comments:

Post a Comment