ఇస్మార్ట్ శంకర్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినపుడు నిధి అగర్వాల్ని ప్రధాన
కథానాయికగా తీసుకుని సెకండ్ హీరోయిన్ రోల్ నభా నటేష్కి ఇచ్చారు. కథ
ప్రకారం ఆమె పాత్ర ఇంటర్వెల్కి ముందే చనిపోతుంది. ఆ తర్వాత హీరోకి మెమరీ
ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత నిధి అగర్వాల్పై ఫీలింగ్స్ స్టార్ట్
అవుతాయి. కానీ షూటింగ్లో వుండగా నిధి కంటే నభా నటేష్కి పూరి వైపు నుంచి
ఎక్కువ మార్కులు పడ్డాయి.
నిధి అగర్వాల్ కాస్త రిజర్వ్డ్గా వుంటే నభా మాత్రం ఫ్రెండ్లీగా వుండేదట. దాంతో నభా నటేష్ పాత్ర నిడివిని పెంచడం కోసం క్యారెక్టర్ చనిపోయినా కానీ ఆమెపై చాలా సన్నివేశాలని మళ్లీ జోడించారట. ఆమె పాత్ర పరిధి పెరగడంతో నిధి అగర్వాల్ సీన్లు తగ్గిపోయాయి. ఫైనల్గా నభా నటేష్ మెయిన్ హీరోయిన్గా, నిధి అగర్వాల్ సపోర్టింగ్ రోల్లా తయారయింది.
ఒక టైమ్లో నిధి అగర్వాల్ పాస్పోర్ట్ ఇష్యూస్ వల్ల షూటింగ్ డిలే అయిందని కూడా మీడియాకి లీకులు వచ్చాయి. అప్పుడే నిధి అగర్వాల్ టీమ్ ఆ వార్తలని ఖండించి, సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాలేదని వాయిదా వేసారే తప్ప తను కారణం కాదని వివరణ ఇచ్చుకుంది. ఇండస్ట్రీలో నెగ్గుకురావాలంటే లౌక్యం తెలియాలని ఊరికే అనరు మరి.
No comments:
Post a Comment