Wednesday, July 24, 2019

నాగార్జునతో పెట్టుకుంటోన్న అనసూయ

రంగమ్మత్తగా 'రంగస్థలం'లో మాస్‌కి చేరువ అయిన జబర్దస్త్‌ సుందరి అనసూయ అప్పుడు వచ్చిన క్రేజ్‌ని పూర్తిగా సొమ్ము చేసుకోలేకపోయింది. పలు చిత్రాలలో అవకాశాలు వచ్చినా కానీ ఏవో ఒకటీ అరా చిత్రాలు మాత్రమే టేకప్‌ చేసిన అనసూయ 'కథనం' అనే చిత్రంలో లీడ్‌ రోల్‌ పోషించింది. థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలు పోషించారు.

రాజేష్‌ నాదెండ్ల అనే కొత్త దర్శకుడు రూపొందించిన కథనం పూర్తయి విడుదలకి సిద్ధమయింది. చిన్న సినిమాలన్నీ పెద్ద చిత్రాలకి దూరంగా సేఫ్‌ డేట్‌ ఎంచుకుంటూ వుంటే కథనం మాత్రం సరాసరి నాగార్జున 'మన్మథుడు 2'తో పోటీగా విడుదలవుతోంది. దీని వల్ల ఒపెనింగ్స్‌ ప్రభావితం అయినా కానీ టాక్‌ బాగా వస్తే పోటీని తట్టుకుంటుందని కథనం టీమ్‌ భావిస్తోంది.

అయితే మన్మథుడు 2 లాంటి చిత్రంతో పోటీ పడడం వల్ల కథనం ఇటు మీడియా దృష్టిని కూడా ఆకర్షించడం కష్టమవుతుంది. అందరూ మన్మథుడు 2కే ప్రిఫరెన్స్‌ ఇస్తారు కనుక అన్ని వెబ్‌సైట్లలో రివ్యూలు రావడానికి కూడా ఆస్కారం వుండదు. ఫ్రీగా వున్న వేరే డేట్స్‌ వున్నా కానీ ఆగస్టు 9న వస్తే ఆగస్టు 15 హాలిడేని క్యాష్‌ చేసుకోవచ్చుననే కథనం టీమ్‌ ప్లాన్‌ ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలిక.

No comments:

Post a Comment