Thursday, July 11, 2019

సమంతకొక న్యాయం.. సాయి పల్లవికో న్యాయం!

'ఓ బేబీ' అనే హిట్‌ సినిమాలో తాను కూడా భాగమైనందుకు హ్యాపీగా వుందని నాగశౌర్య చెప్పాడు. ఎలాగో సమంత చిత్రంగానే పిలవబడుతూ ఆమెకి మాత్రమే ప్రచారం కల్పిస్తోన్న ఈ చిత్రం సక్సెస్‌లో వాటా తీసుకునేందుకు నాగశౌర్య కూడా మీడియా ముందుకి వచ్చాడు. అతడితో ప్రత్యేకించి ప్రచారం చేయించుకోవాలని నిర్మాతలు చూడకపోయినా కానీ తనకిప్పుడు అవసరం కనుక నాగశౌర్య ఈ సక్సెస్‌ని వాడుకుంటున్నాడు.

ఛలో తర్వాత విడుదలైన కణం చిత్రంలో కూడా నాగశౌర్య ఇలాగే హీరోయిన్‌ చాటు హీరోగా నటించాడు. ఛలో సక్సెస్‌కి ముందు ఒప్పుకున్న సినిమా కావడంతో, ఛలోతో తాను స్టార్‌ అయిపోయాననే భ్రమలో కణం చిత్రానికి చాలా అన్యాయం చేసాడు. కనీసం ఆడియో వేడుకకి కూడా వెళ్లకుండా, సాయి పల్లవిపై కూడా చాలా ఆరోపణలు చేసాడు. అదే ఛలో ఫెయిల్‌ అయి వుంటే ఆ చిత్రానికి నాగశౌర్య చేసుకునే ప్రచారం వేరేలా వుండేదని అప్పట్లోనే కామెంట్లు వేసారు.

ఇప్పుడు సక్సెస్‌లో లేడు కనుక చాలా చిన్న పాత్ర అయినా కానీ 'ఓ బేబీ' సక్సెస్‌ క్రెడిట్‌లో షేర్‌ కోసం చూస్తున్నాడని మాట్లాడుతున్నారు. సక్సెస్‌లోను, ఫెయిల్యూర్‌లోను ఒకేలా వుంటేనే కెరియర్‌ పది కాలాల పాటు చల్లగా సాగుతుందని అనుభవజ్ఞులు చెప్పే మాటలు కూడా తలకెక్కించుకుంటే బెటరు.

No comments:

Post a Comment