Saturday, July 20, 2019

ప్ర‌భాస్‌తో పాటు నానికీ టెన్ష‌న్‌... టెన్ష‌న్‌!

యువ కథానాయకులు శర్వానంద్, అడివి శేష్ హ్యాపీ. 'సాహో' విడుదల వాయిదా పడటంతో వాళ్లిద్దరి చిత్రాలు 'రణరంగం', 'ఎవరు'కు థియేటర్లు వచ్చాయి. మంచి రిలీజ్ డేట్ దొరికింది. ఒక రకంగా కింగ్ నాగార్జున కూడా హ్యాపీ. 'మన్మథుడు 2' ఆగస్టు 9న విడుదల కానుంది. ఒకవేళ ఆగస్టు 15న 'సాహో' థియేటర్లలోకి వస్తే... నాగార్జున సినిమాకు థియేటర్లు తగ్గుతాయి. 'సాహో' సునామీ 'మన్మథుడు 2'పై ఎంతోకొంత ప్రభావం చూపుతుందని అనడంలో సందేహం లేదు. వీళ్లు హ్యాపీగా ఉంటే ప్రభాస్ టెన్షన్ పడుతున్నారు. సుమారు మూడు వందల కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మించి, మూడు భాషల్లో విడుదల విడుదల విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సినిమా వాయిదా పడుతుంటే హీరోకి టెన్షన్ ఉండటం సహజమే. టెన్షన్ ప్రభాస్ ఒక్కరికే కాదు... నానికి కూడా. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న 'గ్యాంగ్ లీడర్'ను ఆగస్టు 30న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ అదే రోజున 'సాహో'ను విడుదల చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 30కి 'సాహో' కన్ఫర్మ్ అయితే 'గ్యాంగ్ లీడర్' పరిస్థితి ఏంటి? 'సాహో'కి పోటీగా అదే రోజున విడుదల చేయాలా? వాయిదా వేయాలా? ఈ టెన్షన్‌లో నాని ఉన్నారట.

No comments:

Post a Comment