Tuesday, July 2, 2019

తరుణ్ భాస్కర్ స్టేజ్ మీద వంద రూపాయలు తీసి..

‘పెళ్లిచూపులు’తో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే తనదైన ముద్ర వేశాడు తరుణ్ భాస్కర్. ఆ సినిమాలో అతడి సెన్సాఫ్ హ్యూమర్ అందరూ చూశారు. రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’లో కూడా తన హ్యూమర్ టచ్ చూపించాడు తరుణ్. అతను ఏదైనా సినిమా వేడుకలో భాగంగా వేదిక ఎక్కినా కామెడీ పంచులు మామూలుగా ఉండవు.

తాజాగా ‘బ్రోచేవారెవరురా’ సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన తరుణ్.. మాట్లాడినంతసేపూ అందరినీ కడుపుబ్బ నవ్వించాడు. ఈ సందర్భంగా స్టేజ్ మీద అతను తన జేబులోంచి వంద రూపాయలు తీసి అతను ‘బ్రోచేవారెవరురా’ దర్శకుడు వివేక్ ఆత్రేయకు ఇవ్వడం విశేషం. ‘బ్రోచేవారెవరురా’కు టికెట్లు దొరకడం కష్టంగా ఉందని, అందుకే సినిమా చూడలేదని.. ఈ వంద తీసుకుని ఎక్కడో ఒక చోట తనకు టికెట్ తీసి ఇవ్వాలని తరుణ్ ఇవ్వాలని కోరడం విశేషం.

నిజానికి టికెట్ 150 రూపాయలని.. తనకు వివేక్ 50 రూపాయలు డిస్కౌంట్ ఇప్పిస్తాడని అన్నాడు. వివేక్ ఆ డబ్బులు తీసుకుని ఎక్కడ సినిమా చూస్తావని అడిగితే.. ఎక్కడైనా పర్వాలేదన్నాడు. ఐతే మహేష్ బాబు మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్‌లో టికెట్లు ఇప్పిస్తానని అనగా.. సరే అని, తన గ్యాంగ్‌ను వేసుకుని వచ్చేస్తానని అన్నాడు తరుణ్.

ఇక ఈ వేడుకలో ప్రియదర్శి గురించి మాట్లాడుతూ.. ఈ మధ్య ఏ సినిమా వేడుకలో అయినా అతనే కనిపిస్తున్నాడని.. మొన్నటి దాకా ‘మల్లేశం’ సినిమాను ప్రమోట్ చేశాడని, ఇప్పుడేమో ‘బ్రోచేవారెవరురా’ అంటున్నాడని.. మీడియా వాళ్లకు కూడా అతనంటే బోర్ కొట్టేసిందని.. అతడి ప్రెస్ మీట్లు కవర్ చేసి చేసి మైక్ అందుకోగానే వచ్చాడ్రా వీడు అన్నట్లుగా కామ్ ముఖాలు వేలాడేస్తున్నారని తరుణ్ చమత్కరించడం విశేషం. చివరగా కామెడీలు పక్కన పెట్టి ‘బ్రోచేవారెవరురా’ ఇంత మంచి విజయం సాధించడం తనకు చాలా ఆనందాన్నిచ్చిందని.. ఈ టీం పడ్డ కష్టానికి అంత మంచి సక్సెస్ కచ్చితంగా రావాలని అన్నాడు తరుణ్.

No comments:

Post a Comment