తన మనసులోని అభిప్రాయాల్ని కుండబద్దలుకొట్టినట్టు చెప్పడానికి సమంత
ఏమాత్రం వెనుకాడరు. సోషల్ మీడియాలో అయితే ఏ అంశం మీదైనా నిస్సంకోచంగా
స్పందిస్తుంటారామె. తాజాగా ‘కబీర్ సింగ్’ చిత్రంపై వచ్చిన విమర్శలకు
సమాధానం ఇస్తూ సందీప్ వంగ ఆడ, మగల మధ్య ఒకరికొకరు కొట్టుకునే చనువు లేకపోతే
వారి మధ్య ప్రేమ లేనట్టే అంటూ గట్టిగానే మాట్లాడారు. ఆయన మాటల్లోని
కంటెంట్ పట్ల సమంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తన ఇన్స్టా స్టాయిలో
పోస్ట్ పెట్టారు.
అది చూసిన నెటిజన్లు కొందరు ఆమెపై విరుచుకుపడుతున్నారు. గతంలో ‘అర్జున్
రెడ్డి’ సినిమాతో పరిశ్రమకు గోల్డెన్ డేస్ వచ్చాయి, అదొక రియలిస్టిక్
సినిమా అంటూ సమంత పెట్టిన ట్విట్టర్ పోస్ట్ను వెతికి మరీ పట్టుకుని గతంలో
మీరు చేసిన కామెంట్స్ గుర్తుచేసుకోండి అంటూ కొందరు, ఆమె తాజా చిత్రం ‘ఓ
బేబీ’లో ఉండే ఒక మంచం.. సింహం అనే ఘాటు డైలాగ్ను ఉటకింస్తూ కొందరు
విమర్శలు చేస్తున్నారు. మరి సమంత వీటికి ఎలాంటి ఏం సమాధానం చెబుతారో, అసలు
డీప్లీ డిస్టర్బింగ్ అంటూ ఆమె పెట్టిన కామెంట్ వెనక ఉద్దేశ్యం వేరే ఏదైనా
ఉందని వివరణ ఇస్తారో చూడాలి.
No comments:
Post a Comment