ప్రేమికుల రోజున బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం కామన్. మరీ ముఖ్యంగా ఈరోజున అమ్మాయిలు ఎక్కువగా అందుకుంటారు. అబ్బాయిలు ఎక్కువగా సమర్పించుకుంటారు. ఎవరి రేంజ్ కు తగ్గట్టు వాళ్లు ఖరీదైన బహుమతులతో తమ ప్రేమను వ్యక్త పరుస్తారు. కానీ అహ్మదాబాద్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన భార్యకు కిడ్నీని బహుమతిగా ఇచ్చాడు. తన ప్రేమను గొప్పగా చాటిచెప్పాడు.
అహ్మదాబాద్ కు చెందిన రితాబెన్ పాటిల్ తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. కిడ్నీ పూర్తిగా దెబ్బతినడంతో దాదాపు మూడేళ్లుగా వైద్యులు ఆమెకు డయాలసిస్ చేస్తున్నారు. ఈ పరిస్థితిని చూసిన రితాబెన్ భర్త వినోద్ భాయ్ పాటిల్ చలించిపోయాడు. భార్యకు ఏమైనా చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకున్నాడు.
సరిగ్గా ప్రేమికుల రోజు నాడే రితాబెన్ కు సర్జరీ చేసి, వినోద్ భాయ్ పాటిల్ కిడ్నీని అమర్చారు వైద్యులు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే..ఈరోజు వాళ్ల పెళ్లిరోజు కూడా.
వాలంటైన్స్ డే రోజున, అది కూడా తన పెళ్లి రోజున వినోదాభాయ్ పాటిల్ చేసిన ఈ పని అందర్నీ ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. వినోద్ కు సెల్యూట్ చేస్తూ సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.
తనతో పాటు తన కుటుంబానికి ఎంతో ప్రియమైన వ్యక్తి తన భార్య అని, అలాంటి
వ్యక్తి బాధల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్న వినోద్..
దానికి ప్రేమ అనే పేరు పెడితే అంతకంటే సంతోషం ఏముంటుందంటూ స్పందించాడు.
No comments:
Post a Comment