Friday, June 21, 2019

తమన్నాను నమ్ముకుంటే పనవుతుందా?

పాపం తమన్నా.. నయనతార, అనుష్క, సమంతల్లాగే కెరీర్‌ను పొడిగించుకోవాలని.. ఇంకొన్నేళ్లు ఇండస్ట్రీలో కొనసాగాలని కోరుకుంటోంది. ఫిజిక్, లుక్ పరంగా చూస్తే చాలామంది సీనియర్ హీరోయిన్ల కంటే తమన్నా బెటర్. ఈ మధ్యే వచ్చిన ‘అభినేత్రి-2’లో తమ్మూ ఎలా అందాలు ఆరబోసిందో తెలిసిందే. కానీ ఏం లాభం? ఆమె చేస్తున్న సినిమాలన్నీ బోల్తా కొట్టేస్తున్నాయి. గత రెండేళ్లలో అరడజను దాకా డిజాస్టర్లు ఖాతాలో వేసుకుంది తమన్నా. ఒక్కటంటే ఒక్క సినిమా ఓ మాదిరిగా కూడా ఆడలేదు.

హార్రర్ జానర్లో తమన్నా చేసిన ‘అభినేత్రి-2’, ‘కామోషీ’ లాంటి సినిమాలైతే పూర్తిగా తేలిపోయాయి. అయినప్పటికీ ఆమెను మరో హార్రర్ సినిమాలో ప్రధాన పాత్రకు తీసుకున్నారు. ‘రాజుగారి గది’ సిరీస్‌లో వస్తున్న కొత్త సినిమాలో తమన్నానే కథానాయిక.

‘రాజు గారి గది’ అనుకోకుండా పెద్ద హిట్టవడంతో దాని సీక్వెల్లో నటించడానికి అక్కినేని నాగార్జున, సమంత లాంటి పెద్ద తారలు ముందుకొచ్చారు. కానీ ఈ చిత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. దీంతో ఈ సిరీస్ ఇక ఆగిపోతుందని అనుకున్నారు. కానీ ఓంకార్ ఆగితేనా? తమన్నా ప్రధాన పాత్రలో తమ్ముడు అశ్విన్‌నే పెట్టి ‘రాజు గారి గది-3’ మొదలుపెట్టాడు. గురువారమే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది.

నాగ్ ఉన్న సినిమానే ఆడలేదంటే.. ఈసారి తమన్నానే నమ్ముకున్నారు. ఇంకే ఆకర్షణలూ ఈ చిత్రానికి లేవు. అసలే ఫ్లాప్ హీరోయిన్.. పైగా హార్రర్ జానర్ అచ్చి రాలేదు. మరి ఎలా తమన్నాతో వర్కవుట్ అవుతుందని అనుకున్నారో ఏమో? పోయినసారి పీవీపీలా ఈసారి పెద్ద నిర్మాత కూడా ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఈ సినిమాకు హైప్ రావాలంటే చాలా కష్టమే. మరి ఓంకార్ ధీమా ఏంటో?

No comments:

Post a Comment