Tuesday, July 2, 2019

రాజుగారి గదిలోకి మరో హీరోయిన్ ఎంట్రీ

ఓపెనింగ్ కు కూడా వచ్చి, ఆ తర్వాత తప్పుకుంది తమన్న. అలా రాజుగారి గది-3 సినిమా మెయిన్ లీడ్ లేకుండానే ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఇప్పుడు యూనిట్ అంతా మరో హీరోయిన్ వేటలో పడింది. తమన్న స్థానంలో తాప్సిని తీసుకునే ఆలోచనలో ఉంది. ప్రస్తుతానికైతే చర్చలు సాగుతున్నాయి. ఇంకా ఏదీ కన్ ఫర్మ్ కాలేదు.
హారర్, థ్రిల్లర్ సినిమాలకు ప్రస్తుతం అనుష్క తర్వాత అంతా చూసేది తమన్న, తాప్సి వైపే. నందిత శ్వేత, నందిత రాజ్ లాంటి హీరోయిన్లు ఉన్నప్పటికీ వాళ్లతో సినిమాలు తీస్తుంటే క్రేజ్ రావడంలేదు. మరోవైపు అనుష్క లిమిటెడ్ గా వెళ్తోంది. ఈ నేపథ్యంలో అంతా తమన్న, తాప్సి వైపు చూస్తున్నారు.
ఏ చిన్న బాలీవుడ్ ఛాన్స్ వచ్చినా మిస్ చేసుకోదు తమన్న. అలాంటి చిన్న అవకాశం రావడంతో రాజుగారి గది-3 నుంచి తప్పుకుంది మిల్కూబ్యూటీ. ఇప్పుడా స్థానాన్ని మిగిలిన ఏకైక ఆప్షన్ తాప్సితో భర్తీచేయాలని చూస్తున్నాడు దర్శకుడు ఓంకార్.
నిజానికి ఈ సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలనేది ఓంకార్ ప్లాన్. రాజుగారి గది-2లో ఆమె నటించింది. కానీ పార్ట్-3 స్టోరీ సమంతకు నచ్చలేదు. అందుకే తమన్నాను తీసుకున్నారు. ఇప్పుడు ఆమె కూడా తప్పుకోవడంతో తాప్సి కోసం ట్రై చేస్తున్నారు. తాప్సి కూడా నో చెబితే ఎవర్ని తీసుకుంటారో చూడాలి.

No comments:

Post a Comment