Wednesday, July 3, 2019

ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్

సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అక్కడి జనజీవనం స్తంభించిపోయింది. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముంబయి ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరాల్సిన రకుల్‌.. విమానాలు రద్దవడంతో అక్కడే చిక్కుకుపోయారు. ‘ముంబయి ఎయిర్‌పోర్ట్‌ తెరిచి ఉందో లేదో ఎవరైనా సమాచారం అందిస్తారా?’ అంటూ బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ ముంబయి పోలీసులను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు.
ఈ ట్వీట్‌కు రకుల్‌ స్పందిస్తూ.. ‘సోమవారం రాత్రి నుంచి ఒక్క విమానం కూడా ఎయిర్‌పోర్ట్‌ నుంచి కదల్లేదు. నేను ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయాను’ అని సమాధానమిచ్చారు. భారీ వర్షాల కారణంగా అనేక విమానాలను దారి మళ్లించగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు ఈ నెల ఐదో తేదీ వరకు ముంబయిలో అతిభారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

No comments:

Post a Comment