సూపర్ స్టార్ మహేష్ బాబు
సినిమా అంటే ఏ నిర్మాతకు ఆసక్తి వుండదు? ఎగిరి గంతేసి మరీ తాము
చేస్తామంటే, తాము నిర్మిస్తామని ముందుకు వస్తారు. ఇలా అనే టాలీవుడ్ లో
ఎవరైనా అనుకుంటారు. కానీ లేటెస్ట్ గా వినవస్తున్న గ్యాసిప్ ఏమిటంటే,
నిర్మాత దిల్ రాజు తను చేయాలనుకుంటున్న మహేష్ సినిమా విషయంలో కాస్త
అనాసక్తితో వున్నారన్నది. వినడానికి ఇది కాస్త ఆశ్చర్యంగా వున్నా,
వినిపిస్తున్న గ్యాసిప్ ఇదే.
డైరక్టర్ వంశీ పైడిపల్లికి హీరో
మహేష్ బాబుతో ఓ సినిమా చేయడానికి ఇప్పటికే ఓకే అయింది వ్యవహారం. వంశీ
పైడిపల్లికి అడ్వాన్స్ ఇచ్చింది నిర్మాత పివిపి, అందులో నిర్మాత దిల్ రాజ
కు కూడా భాగస్వామ్యం వుంది. కానీ మహర్షి సినిమా వ్యవహారం చూసిన తరువాత
నిర్మాత దిల్ రాజు, అలాగే పివిపి కూడా సినిమా చేయాలా? వద్దా? అనే ఆలోచనలో
వున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే మహర్షి సినిమా వల్ల అటు దిల్ రాజుకు కానీ, ఇటు పివిపికి కానీ
పెద్దగా లాభం ఏమీలేకపోయిందన్నది వారికి, వారి సన్నిహితులకు తెలిసిన
వాస్తవం. ముఖ్యంగా పివిపి మహర్షి డీల్ వల్ల కాస్త గట్టిగానే ఇబ్బంది
ఎదుర్కొన్నారు. కొంత నష్టపోయారని టాక్. ఓవర్ ఫ్లోస్ వల్ల వచ్చిన లాభాలు ఈ
నష్టాలను ఎంతవరకు కవర్ చేసాయన్నది తెలియాల్సివుంది.
అలాగే మహేష్ తరువాత సినిమా సరిలేరు నీకెవ్వరుకు కూడా వంద కోట్లకుపైగా
ఖర్చు వుంటుందని వినిపిస్తోంది. ఆ సినిమాకు నాన్ థియేటర్ హక్కులు తన
రెమ్యూనిరేషన్ గా మహేష్ బాబు తీసుకుంటున్నారు. కేవలం థియేటర్ హక్కుల మీద
లాభాలు తెచ్చుకోవాలి.
ఇలాంటి నేపథ్యంలో దిల్ రాజు
వెళ్లి మహేష్ బాబుతో ఓ మాట అన్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
అదేమంటే..''... మీరు రెమ్యూనిరేషన్ గా నాన్ థియేటర్ హక్కులు వుంటాయి.
డైరక్టర్ కు రెమ్యూనిరేషన్ వుంటుంది. నిర్మాతగా మాకు కూడా ఓ రెమ్యూనిరేషన్
ముందే ఫిక్స్ చేసి, అప్పుడు సినిమా చేస్తే బెటర్ అనిపిస్తోంది..'' అని.
అంటే నిర్మాతగా లాభం వుండడంలేదు అని దిల్ రాజు అన్యాపదేశంగా చెప్పారన్నమాట.
ఇదిలావుంటే వంశీ పెడిపల్లి వ్యవహార శైలి, ఖర్చు, నిర్మాణానికి బాగా టైమ్
తీసుకోవడం వంటి వ్యవహారాల కారణంగా, అలాగే నూటయాభై కోట్ల సినిమా తీసినా,
పెద్దగా లాభాలు వుండని పరిస్థితి నేపథ్యంలో ఎవరైనా ఈ ప్రాజెక్టు కావాలంటే
ఇచ్చేస్తానని దిల్ రాజు ఒకరిద్దరు ఇండస్ట్రీ జనాల దగ్గర వ్యాఖ్యానించినట్లు
తెలుస్తోంది.
నిర్మాత దానయ్య కావాలంటే ఈ సినిమా చేసుకోవచ్చేమే అనేమాట కూడా దిల్ రాజు
నోట ఇండస్ట్రీ జనాలు ఒకరిద్దరి దగ్గర వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మరో
పెద్ద బ్యానర్ జనాలను కూడా దిల్ రాజు 'మీరు చేసుకుంటామంటే చెప్పండి, నేను
సెట్ చేస్తాను' అని అన్నట్లు తెలుస్తోంది.
వంశీపైడిపల్లి-మహేష్ బాబు సినిమా అయితే పక్కా. అందులో సందేహం లేదు. మరి
దిల్ రాజునే నిర్మాతగా వుంటారా? ఏమైనా ట్విస్ట్ లు చోటు చేసుకుని, దానయ్య,
ఆసియన్ సునీల్ వంటి వారు నిర్మాతగా చేరుతారా? అన్న ఆసక్తికరమైన సందేహాలు
ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
No comments:
Post a Comment