Tuesday, May 17, 2016
రూ.500కే విమానం ఎక్కే చాన్స్
ఆకాశంలో ఝామ్మంటూ దూసుకుపోవాలనుకునే వారికో శుభవార్త. విమాన సంస్థల్లో పోటీ పెరగడంతో ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ఎయిర్ ఏషియా, స్పైస్ జెట్ల ఆఫర్లు ప్రయాణికులకు కలిసొచ్చేలా కన్పిస్తోంది. తాజాగా రిటర్న్ టికెట్లపై ఎయిర్ ఏషియా 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో స్పైస్ జెట్ కూడా ఆఫర్ల వర్షం కురిపించింది. స్పైస్ జెట్ తన 11వ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజుల సేల్ ప్రకటించింది.
ఈ కొత్త ఆఫర్ల ప్రకారం స్వదేశీ విమాన టికెట్లను రూ. 511ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. విదేశాలకు వెళ్లే విమానాల్లో టికెట్లను రూ. 2,111 నుంచి ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ బుకింగ్స్ ఇవాళ్టి నుంచి ఈ నెల 19 వరకు ఉండనున్నట్లు తెలిపింది. బుక్ చేసుకున్న టికెట్లతో స్వదేశీ ప్రయాణాలను జూన్ 15 నుంచి సెప్టెంబర్ 30 లోగా, విదేశీ ప్రయాణాలు జూన్ 1 నుంచి జూలై 20 వరకు చేయాల్సి ఉంటుంది. కేవలం స్పైస్జెట్ నెట్వర్క్లోని డైరెక్ట్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ ప్రకటించింది. ఇంకేంటి సరదాగా ఓ టూర్ వేసి రావడానికి బుకింగ్ చేసుకుంటే పోలా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment