Friday, December 15, 2017

చెప్పకనే చెబుతున్న చెర్రీ-ఎన్టీఆర్

రామ్ చరణ్- ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో సినిమాపై చాలానే మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కథ అలా.. క్యారెక్టర్స్ ఇలా అంటూ ఎవరి అంచనాలు వాళ్లు చెప్పేసుకుంటున్నారు. కానీ ఇది రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా కావడంతో.. ఇలాంటివి చివరకు నీరుగారిపోయే అవకాశాలే ఎక్కువ.

అయితే.. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఇప్పటివరకూ ఈ మల్టీస్టారర్ మూవీపై అసలు అధికారిక ప్రకటన రాలేదు. రాజమౌళి.. ఎన్టీఆర్.. రామ్ చరణ్.. వీళ్లలో ఎవరూ ఈ సినిమా సంగతి తేల్చలేదు. కానీ వరుసగా జరుగుతున్న సిట్యుయేషన్స్ చూస్తే నిజమే అని ఊహించేసుకుంటున్నారు ఫ్యాన్స్. రీసెంట్ గా చెర్రీ వైఫ్ ఉపాసన.. ఓ ప్రీ-క్రిస్మస్ బాష్ ఏర్పాటు చేసింది. తనే ప్రత్యేకంగా ఓ క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేసి.. డెకరేట్ చేసి.. అత్యంత సన్నిహితులను మాత్రమే పిలిచారు.

ఈ కార్యక్రమానికి శర్వానంద్.. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగాలు అటెండ్ అయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కూడా ఈ ప్రీ-క్రిస్మస్ బాష్ లో సందడి చేశాడు. ఇద్దరూ కలిసి ఫోటోకు పోజ్ ఇవ్వకపోయినా.. ఒకటే ప్లేస్ లో నుంచుని ఓ హింట్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు జనాలు. మొత్తానికి యంగ్ టైగర్ - మెగా పవర్ స్టార్ లపై ఏ చిన్న పోలిక వచ్చినా.. దాన్ని రాజమౌళి మల్టీస్టారర్ తో ముడిపెట్టేస్తున్నారు జనాలు.

No comments:

Post a Comment