Friday, December 15, 2017

త్రివిక్రమ్.. తెరవెనుక సస్పెన్స్ ఏంటో.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గత కొంత కాలంగా ఏ మాత్రం గ్యాప్ తీసుకోవడం లేదు. ఒక సినిమా షూటింగ్ అయిపోగానే పెన్ను పేపర్ పై పెట్టిసి ఏ మాత్రం ఆపకుండా చక చక కథలను రాసేస్తున్నట్టు ఉన్నాడు. అజ్ఞాతవాసి షూటింగ్ అయిపోకముందే ఎన్టీఆర్ తో ఒక సినిమాకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత వెంకటేష్ తో చేయబోతున్నడని ఆయన ఆస్థాన నిర్మాణ సంస్థ హారికా హాసిని ప్రొడక్షన్ చెప్పేసింది.

అయితే ఆ సినిమా తర్వాత కూడా ఈ మాంత్రికుడు ఒక కాన్సెప్టును దాచుకున్నాడని తెలుస్తోంది. అది కూడా మహేష్ బాబుతోనే ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతోంది. అయితే ఇందులో ఒక లాజిక్ చాలా కన్ఫ్యూజన్ కి గురి చేస్తోంది. కుదిరితే వెంకటేష్ కంటే ముందే మహేష్ తో చేయవచ్చు అనే టాక్ వినిపిస్తోంది. సాధారణంగా త్రివిక్రమ్ అనుకుంటే కొన్ని కథలని వీలైనంత త్వరగా పూర్తి చేయగలడు.. అదే విధంగా ఎన్టీఆర్ తో తొందరగా పూర్తి చేసి హారికా హాసిని వారికీ కొంచెం గ్యాప్ ఇవ్వాలని అనుకుంటున్నాడట.

ఇక మరో వైపు మహేష్ భారత్ అనే నేను అయిపోగానే 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. ఆ తర్వాత 26వ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారితో చేయాలనీ అనుకుంటున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఆ సినిమా ఉండవచ్చు. సో.. ఎన్టీఆర్ తో అయిపోగానే మహేష్ ని ఎంచుకుంటాడా లేక వెంకీని ఎంచుకుంటాడా అనేదే సస్పెన్స్. మరొక ట్విస్ట్ ఏంటంటే గతంలో వెంకీకి త్రివిక్రమ్ ఒక మల్టి స్టారర్ కథను చెప్పాడు. బహుశా ఆ కథలో వెంకీ - మహేష్ కలిసి నటిస్తారా అనే అనుమానం కూడా కలుగుతోంది. చూడాలి మరి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటయో?  

No comments:

Post a Comment