పక్కా కమర్షియల్ సినిమాలు తీసిన హరీష్ శంకర్ రూటు మార్చానని ఇంతకుముందే
చెప్పాడు. దాగుడుమూతలు అనే టైటిల్ తో డిఫరెంట్ లవ్ సబ్జెక్ట్ రెడీ
చేసుకున్నాడు. ఈ మూవీకి లొకేషన్లు ఫిక్స్ చేసేందుకు అమెరికా కూడా
వెళ్లొచ్చాడు. ఈ మల్టీస్టారర్ మూవీలో నితిన్, శర్వానంద్ హీరోలుగా
నటిస్తారనే విషయాన్ని నిర్మాత దిల్ రాజు తాజాగా నిర్థారించాడు.
ఇప్పుడీ సినిమా కోసం హీరోయిన్లను ఫిక్స్ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు.
ఇందులో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే రకుల్ ను
కలిసి స్టోరీలైన్ వినిపించాడట హరీష్ శంకర్. ప్రస్తుతం సినిమాలకు నెల
రోజులు గ్యాప్ ఇచ్చిన రకుల్.. వచ్చే ఏడాది 'దాగుడుమూతలు' ప్రాజెక్టుకు
కాల్షీట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
శర్వానంద్ లేదా నితిన్ లో ఎవరి సరసన రకుల్ నటిస్తుందనే విషయంపై క్లారిటీ
లేదు. రకుల్ ఫిక్స్ అయిన తర్వాత మరో హీరోయిన్ కోసం సంప్రదింపులు
ప్రారంభిస్తారట. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది.
No comments:
Post a Comment