Tuesday, July 9, 2019
జగన్కి హ్యాండిచ్చిన దిల్ రాజు
నైజాం, ఉత్తరాంధ్ర ఏరియాల్లో థియేటర్లు పెద్ద సంఖ్యలో లీజుకి తీసుకున్న దిల్ రాజు వాటి ఫీడింగ్ కోసమయినా తరచుగా ఏదో ఒక సినిమా పంపిణీ చేస్తుంటాడు. పెద్ద సినిమాలపై పెట్టుబడి పెడుతూ, చిన్న చిత్రాలకి అయితే రాయల్టీ మీద రిలీజ్ చేస్తుంటాడు. సాధారణంగా దిల్ రాజు ఎలాంటి డబ్బులు ఇవ్వక్కర్లేని చిత్రాలకి వెయిట్ ఇస్తుంటాడు. కానీ 'ఇస్మార్ట్ శంకర్'కి మాత్రం ఎలాంటి చేయూత ఇవ్వనని తేల్చేసాడు. పూరి జగన్నాథ్తో ఇంతకుముందు దిల్ రాజుకి మంచి సంబంధాలుండేవి. అయితే మెహబూబా చిత్రం దిల్ రాజుని తీవ్రంగా నిరాశ పరచింది.
ఆ తర్వాత డబ్బులు సర్దుబాట్ల విషయంలోను పొరపొచ్చాలు వచ్చినట్టు చెప్పుకున్నారు. అది మనసులో పెట్టుకున్నాడో లేక రీసెంట్ రిలీజ్ అయిన 'ఇస్మార్ట్ శంకర్' ట్రెయిలర్ చూసాడో కానీ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి కుదరదనేసాడు. కనీసం పర్సంటేజీ పద్ధతిలో తన థియేటర్లు ఇవ్వడానికి కూడా దిల్ రాజు కాదన్నాడు. తనకే ఇప్పుడు చాలా చిత్రాలు చేతిలో వున్నాయి కనుక అంత తీరిక లేదని తప్పుకున్నాడు. నిజానికి సినిమా రిలీజ్ చేస్తే దిల్ రాజుకి వచ్చే నష్టమేం లేదు. అతను దానికోసం సమయం కేటాయించాల్సిన నని కూడా లేదు. అన్నిటికీ మించి ఇప్పుడు అతను కొన్న సినిమాలేవీ విడుదల కావడం లేదు. అయినా కానీ దిల్ రాజు ఇంత కఠినంగా నో అనేసాడంటే పాత విషయాలు మరచిపోలేదనే చెవులు కొరుక్కుంటున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment