Tuesday, July 9, 2019
రెండు సీన్లకి నలభై కోట్లు... రాజమౌళితో అంతే!
రాజమౌళి ఎలాంటి సినిమా తీసినా మూడు ముఖ్య ఘట్టాలుంటాయి. హీరో పరిచయ సన్నివేశం, ఇంటర్వెల్ ఎపిసోడ్, పతాక సన్నివేశం. వీటిపైనే అతను మాగ్జిమం ఖర్చు పెట్టిస్తుంటాడు. అతను తీసిన సగటు కమర్షియల్ సినిమా అయినా, బాహుబలి అయినా కానీ రాజమౌళి ఫార్ములా ఇదే. ఇప్పుడు ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ తీస్తున్నా కానీ రాజమౌళి పరిచయ సన్నివేశాలకే నలభై కోట్లు కేటాయించేసాడు. చరణ్, ఎన్టీఆర్ ఇద్దరి పరిచయ సన్నివేశాలూ అదిరిపోయేలా వుంటాయట. ఈ సీన్లకి ఫాన్స్ పూనకాలు తెచ్చుకోవాలనేట్టుగా వీటిని రాసాడట.
వాటిని చిత్రీకరించడానికి కూడా నలభై కోట్ల బడ్జెట్ కేటాయించాడట. ఇంట్రడక్షన్ సీన్లకే ఒక మీడియం రేంజ్ హీరో సినిమా బడ్జెట్ పెట్టిస్తున్నాడంటే ఆ సీన్లు ఏ రేంజ్లో వుంటాయో ఊహించుకోవడం కూడా కష్టమే. ఈ లెక్కన ఇద్దరు హీరోలు కలిసి కనిపించే ఇంటర్వెల్, క్లయిమాక్స్ సీన్లకి ఎంత బడ్జెట్ వేసాడో మరి. మొదలు పెట్టినపుడు మూడొందల కోట్ల సినిమా అనుకున్నది కాస్తా ఇప్పటికే నాలుగొందల కోట్ల ఎస్టిమేషన్ రీచ్ అయింది. పూర్తయ్యే నాటికి అయిదు వందల కోట్లు అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఈ చిత్రానికి హీరోలు కాకుండా ఇతర తారాగణం కూడా భారీగానే వుంది కనుక పారితోషికాలకే ఒక సూపర్స్టార్ సినిమాకి అయ్యే బడ్జెట్ గ్యారెంటీ అని మాట్లాడుకుంటున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment