నాని ఎంసీఏ సినిమా 21న థియేటర్లలోకి వస్తోంది. ఆ వెంటనే 22న అఖిల్ హలో
మూవీ వస్తోంది. ఈ రెండు సినిమాల మధ్య గట్టిపోటీ ఉంటుందనేది ఫిక్స్. అయితే ఈ
రెండు సినిమాలకు పోటీగా మరో మూవీ కూడా ఉంది. అదే సల్మాన్ నటించిన టైగర్
జిందా హై.
ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకానున్న ఈ సినిమా
మల్టీప్లెక్సుల్లో నాని, అఖిల్ సినిమాలకు గండికొడుతుందనే అంచనాలు ఉన్నాయి.
హైదరాబాద్, విశాఖపట్నం, వరంగల్ లాంటి సిటీల్లో సల్మాన్ సినిమాలకు డిమాండ్
ఉంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లోని దాదాపు అన్ని మల్టీప్లెక్సులు సల్మాన్
సినిమాకు కూడా ప్రాధాన్యం ఇచ్చాయి.
అటు ఓవర్సీస్ లో కూడా అఖిల్, నాని సినిమాలకు టైగర్ ఎఫెక్ట్
తప్పకపోవచ్చు. భాషతో సంబంధం లేకుండా దాదాపు ఎన్నారైలంతా బాలీవుడ్ సినిమాలు
చూస్తారు. పైగా సల్మాన్-కత్రిన జంటకు ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి
క్రేజ్ ఉంది.
సల్మాన్ పారితోషికంతో కలుపుకుంటే 200కోట్ల రూపాయల బడ్జెట్ తో
తెరకెక్కింది టైగర్ జిందా హై సినిమా. పాకిస్థాన్ మినహా మిగతా అన్ని ముఖ్య
దేశాల్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ట్రయిలర్ పెద్ద హిట్ అవ్వడంతో మూవీపై
అంచనాలు భారీగా ఉన్నాయి.
No comments:
Post a Comment