Wednesday, July 3, 2019

‘ఇస్మార్ట్ శంకర్ పూరి చుట్టేశాడా.. మారాడా?

ఏమైనా అంటే వారంలో స్క్రిప్టు రాసేస్తా.. రెండు మూడు నెలల్లో సినిమా తీసేస్తా అంటాడు పూరి జగన్నాథ్. ఆయన హిట్లలో ఉన్నపుడు ఇలాంటి ముచ్చట్లు బాగానే అనిపించాయి. కానీ ఫ్లాపుల పరంపర మొదలయ్యాకే ఇవన్నీ ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయి. ఆయన తీస్తున్న సినిమాల్లో  కంటెంట్ చూశాక ఈ మాత్రం కథలు వారంలో రాయడం.. రెండు మూడు నెలల్లో తీసేయడంలో విశేషంగా ఏమీ అనిపించడం లేదు. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా, ప్రేక్షకుల నుంచి మళ్లీ మళ్లీ తిరస్కారం ఎదురవుతున్నా పూరి రాతలో, తీతలో ఏమీ తేడా కనిపించడం లేదు. ఒక మూసలో పడిపోయి ఒకే తరహా సినిమాలు వడ్డిస్తున్నాడాయన. రొటీన్ కథలు తీసినా.. పూరి మార్కు పంచ్ కనిపించకపోవడంతో అవి ప్రేక్షకులకు రుచించడం లేదు.

తాజాగా పూరి.. రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ తీశాడు. దీని టీజర్ రిలీజ్ ముందు వరకు కాంబినేషన్ ఆసక్తి రేకెత్తించి, సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుందని అనుకున్నారు. కానీ టీజర్ చూశాక ఆ ఆశలు ఆవిరయ్యాయి. పూరి పాత కథనే రీసైకిల్ చేశాడనిపించింది. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ఏ ప్రోమోలోనూ కొత్తదనం అయితే కనిపించలేదు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేస్తూ ఒక పోస్టర్ వదిలారు. అది కూడా అంతే. ఈ సందర్భంగా షూటింగ్ కూడా పూర్తయిందని.. ఈ నెల 18నే రిలీజ్ అని ఖరారు చేశాడు పూరి. షూటింగ్ అయిందనగానే పూరి ఈసాిరి ఏం తీశాడో.. ఏమాత్రం కొత్తదనం చూపించాడో.. అసలు ఆయన మారాడా అనే కామెంట్లు పడుతున్నాయి. టీజర్‌కు రెస్పాన్స్ చూశాక అయినా.. పూరి ఏమైనా జాగ్రత్త పడ్డాడా.. ప్రేక్షకుల అంచనాలకు భిన్నమైన సినిమా ఆయన నుంచి వస్తుందా అన్న చర్చ నడుస్తోంది. ఈసారి అయినా పూరి మార్పు చూపించకుండా ఎప్పట్లాగే సినిమాను చుట్టేసి ఉంటే మాత్రం ఆయన కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడిపోవడం ఖాయం.

No comments:

Post a Comment